UPDATES  

 ఏటీఎం సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రేగా

మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 24
మండల పరిధిలోని జానంపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన హిటాచి ఏటీఎం సెంటర్ ను శుక్రవారం   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు  చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జానంపేట గ్రామంలో ఏటీఎం సెంటర్ ప్రారంభం కావడం సంతోషమని, ప్రజలందరూ సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఏటీఎం నిర్వహకులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, హిటాచి ఏటీఎం నిర్వాహకులు, ఎడ్ల కుమార్, పొనుగోటి కామేశ్వరరావు, బోడ ఈశ్వర్, బుల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !