పోక్సో కేసులో నిందితునికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష
నిందితుడికి శిక్ష పడేవిధంగా కృషి చేసిన అధికారులను,సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ డా.వినీత్
మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 23…దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తూరుబాక గ్రామంలో 2018వ సంవత్సరంలో 16 నెలల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు అజ్మీరా సాయి కిరణ్ కు 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష,పదివేల రూపాయల జరిమానాను విధిస్తూ ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి ఎం. శ్యామ్ శ్రీ తీర్పును వెలువరించారు. దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్.52/2018, యు/ఎస్.376(2)(ఐ) ఐపిసి,సెక్షన్ 6 ఆఫ్ పొక్సో యాక్ట్ 2012 ప్రకారం అప్పటి స్టేషన్ హౌస్ అధికారి బాలకృష్ణ కేసు నమోదు చేయడం జరిగింది.ఇట్టి కేసునకు విచారణాధికారిగా అప్పటి భద్రాచలం ఏఎస్పీగా ఉన్న సంగ్రామ్ సింగ్ పాటిల్ సమగ్ర దర్యాప్తును చేపట్టి కోర్టు వారికి పూర్తి సాక్ష్యాధారాలను సమర్పించారు.
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా కృషి చేసిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి లక్ష్మీ,దుమ్ముగూడెం సిఐ దోమల రమేష్ , కోర్టు డ్యూటీ అధికారులు హెడ్ కానిస్టేబుల్ హరిగోపాల్,కానిస్టేబుల్ సీహెచ్.హనుమంతరావు లను గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా.వినీత్ ప్రత్యేకంగా అభినందించారు.
