UPDATES  

 కంటివెలుగు పేదలకు వరం… బెండాలపాడు పంచాయతీ సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు.. .

మన్యం న్యూస్ చండ్రుగొండ, మార్చి01: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంతో అంధత్వ నివారణ చేయటం జరుగుతుందని, పేదలకు వరం లాంటిదని, పంచాయతీ సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బెండాలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు కేంద్రాన్ని ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కంటివెలుగు కార్యక్రమం ముఖ్యమంత్రి. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగిందని, ఈ పథకాన్ని ప్రతి యొక్కరు. సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో 18 ఏండ్లు నిండిన ప్రతి యొక్కరు ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటీసీ బొర్రా లలిత, బిఆర్ఎస్ జిల్లా నాయకులు మేడా మోహన్ రావు, కంటి వైద్యులు రఘునందన్ సాయి, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్ రాజేశ్వరి, నాయకులు లక్ష్మణ్, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !