UPDATES  

 మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గుండాలపాడు బిటి రోడ్డు పనులు పరిశీలన,

మన్యం న్యూస్. ములకలపల్లి. మర్చి 01. మండలంలో ని పాతగుండాలపాడుగ్రామం, లో తాటి శ్రీరాములు – రజినీ దంపతుల కమార్తే కవిత వివాహ వేడుకలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం పాల్గొన్నారు.అనంతరం పాత గుండాల పాడుగ్రామానికి ఇటీవలే మంజూరి అయినా బిటి రోడ్డు పనులను పరిశీలించి,పనులు త్వరగా పూర్తయ్యే విధంగా చూడాలని, నాణ్యతలో ఎలాంటి రాజి పడకుండా రోడ్డు పనులు జరిగేవిదంగా చూడాలని ఐ టి డి ఏ అధికారి సుబ్బరాజు నీ ఆదేశించారు.తరువాత పలు శుభాకార్యల్లో పాల్గొని చిన్నారులను ఆశీర్వాదించారు.ఈ కార్యక్రమంలో దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,ములకలపల్లి బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు మొరంపుడి అప్పారావు,స్థానిక సర్పంచ్ కారం కుమారి,ఉప సర్పంచ్ కారం రాము,పామార్తి వెంకటేశ్వరరావు, పాలకుర్తి ప్రసాద్,తుర్రం శ్రీను, పాలకుర్తి నాగా బుషణం,రాజారావు,ప్రసాద్, మండల యువజన విభాగం అధ్యక్షుడు ప్రవీణ్, తాటి రాజులు,కారం ప్రసాద్,కారం పెద్దమ్మ, కొండ్రు సాయి,పోడియం సుజాత,కారం వేంకటేశ్వరలు,,సున్నం రాజు,వీరభద్రమ్,రవి, మదకం లక్ష్మి,మీన,వాడే రోజా,పోడియం మీన,పోడియం రాములమ్మ,పోడియం కన్నమ్మ, తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !