మన్యం న్యూస్, భద్రాచలం :
శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం 2023 సంవత్సరానికి గాను జిల్లా మంత్రి నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య మాట్లాడుతూ… రివ్వూ మీటింగ్ లు నిర్వహించడం వల్ల భద్రాద్రి రామునికి గాని, భద్రాచలం ప్రాంత ప్రజలకు గాని ఒరిగేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ విభజన సమయంలో భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు అన్న సీఎం కేసీఆర్ భద్రాచలం రాముని, భద్రాచల ప్రాంత ప్రజలను 100 కోట్లు 1000 కోట్లు అని మాయమాటలతో మోసం చేశారని విమర్శించారు. తాను ఎన్నో సార్లు అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రాలో కలిపిన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలిపి భద్రాచలం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరినప్పటికీ జిల్లా మంత్రి ఉన్న పువ్వాడ అజయ్ గానీ, సీఎం కేసీఆర్ గారు కానీ ఆ విషయంపై దృష్టి చారించకుండా భద్రాచలం ప్రాంతం అభివృద్ధికి నోచుకోకుండా చేశారని విమర్శించారు. ఈసారి కళ్యాణానికైనా ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆర్ గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే విధంగా మంత్రి పువ్వాడ అజయ్ ప్రయత్నించాలని కోరారు.