UPDATES  

 శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి..

  • శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి
  •  – ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలి
  •  – అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి
  •  – సమీక్ష సమావేశంలో మంత్రి పువ్వాడ

 

మన్యం న్యూస్, భద్రాచలం :

శ్రీరామనవమి , మహాపట్టాభిషేకం మహోత్సవాలు వీక్షణకు పెద్దఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సోమవారం భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో శ్రీరామనవమి, మహాపట్టాభిషేకం మహోత్సవాలు సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లుపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మొదటగా జిల్లా కలెక్టర్ అనుదీప్ మహోత్సవాలకు చేపడుతున్న పనులు, అధికారులకు కేటాయించిన విధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కరోనా విపత్తు సమయంలో, గోదావరి వరదలు, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి పర్యటన, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డా. వినీత్ ఆద్వర్యంలో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ప్రజల మన్ననలు పొందారని, అదే స్పూర్తితో ఈ మహోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలని చెప్పారు. భద్రాచలం విచ్చేయు భక్తుల సౌకర్యార్థం 24 గంటలు పనిచేయు విధంగా అత్యవసర వైద్యకేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అత్యవసర, ఐసియు వార్డులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అస్వస్థతకు గురైన భక్తులను తక్షణమే వైద్య శాలకు తరలించేందుకు 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణకు పట్టణాన్ని 15 జోన్లుగా విభజించి ప్రతి జోను ఓ నలుగురు కార్యదర్శులు పర్యవేక్షణ చేయు విధంగా చర్యలు చేపట్టాలని డిపిఓకు ఆదేశించారు. 450 మంది పారిశుధ్య కార్మికులు పరిశుబ్రత కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. భక్తులు వేడుకలు వీక్షించేందుకు వీలుగా 36 ఎల్ఈడి టీవీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. స్వామి తలంబ్రాలు పంపిణీకి 70 కేంద్రాలు, 19 ప్రసాదాలు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. హెూటళ్లలో లభ్యమయ్యే ఆహార పదార్థాలను ఎక్కువ ధరలకు విక్రయించకుండా ధరలను నిర్ణయించడంతో పాటు నాణ్యత పాటించు విధంగా చర్యలు చేపట్టాలని డిఎసీను ఆదేశించారు. భక్తులు రైళ్లు, బస్సుల సమాచారంతో పాటు జిల్లాలోని దర్శనీయ స్థలాలు, మహోత్సవాల సమాచారం తెలుసుకునేందుకు ఏర్పాటు చేయనున్న 25 సమాచార కేంద్రాలలో ఫ్లెక్సీలు, కరపత్రాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. భక్తులు వాహనాలు నిలుపుదల చేసేందుకు 6 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. భక్తులు స్నానాలు చేసేందుకు, బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రతి సెక్టారు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. ప్రతి భక్తుకుని స్వామి తలంబ్రాలు అందించాలన్న లక్ష్యంతో 200 క్వింటాళ్లు తయారు చేస్తున్నట్లు చెప్పారు. భద్రాచలం, పర్ణశాలలో భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా డేంజర్ బోర్డులు ఏర్పాటుతో పాటు నాటు పడవలను, గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. గోదావరి నదిలో లోతుగా ఉండే ప్రమాదకర ప్రాంతాలకు ఎవరు వెళ్లకుండా నియంత్రణ చేసేందుకు ఇనుపమెష్ ఏర్పాటుతో, పాటు నిరంతర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా అదనపు ఫీడర్లు ద్వారా విద్యుత్ సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు జనరేటర్ సిద్ధంగా ఉంచాలని విద్యుత్ అధికారులకు సూచించారు. 29 నుండి 31వ తేదీ వరకు మద్యం, మాంసాహారాలు విక్రయాలను నిలిపివేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ ఈఎస్ జానయ్యకు సూచించారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు వస్తున్నందున హెలిప్యాడ్లు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. అగ్నిప్రమాదాలకు ఆస్కారం లేకుండా దేవాలయం చుట్టుప్రక్కల అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచడంతో పాటు సెక్టార్లులో ఫైర్ఎస్టింగ్విష్ పరికరాలు సిద్ధంగా ఉంచాలని అగ్నిమాపక అధికారిని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, ఎస్పీ డాక్టర్ వినీత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈఓ రమాదేవి, భద్రాచలం ఆర్డీఓ రత్నకళ్యాణి, ఏఎస్పీ పరితోష్పంకజ్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !