మన్యంన్యూస్,ఇల్లందు పట్టణం మార్చి 21:ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై నాలుగవ వార్డు నందు స్థానిక వార్డు కౌన్సిలర్ వాంకుడోత్ తార ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు మంగళవారం ప్రారంభించారు. డీవీతో పాటు ఇల్లందు మున్సిపల్ కమిషనర్ అంకుషావలి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా తెలిపారు. కళ్ళను డాక్టర్లు పరీక్షించి దృష్టిలోపం ఉన్నవారికి వెంటనే కళ్ళజోళ్ళు ఏర్పాటు చేయడం, అవసరమైతే ఆపరేషన్లకు పెద్ద ఆస్పత్రులకు పంపించడం ద్వారా ప్రజలందరికీ మంచి కంటి చూపు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యలక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కంటి వెలుగు వైద్య సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, ఆశా వర్కర్లు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
