UPDATES  

 ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నీ కలిసిన నియోజకవర్గ ఉపాధి హామీ కాంట్రాక్ట్ ఉద్యోగులు..

మన్యం న్యూస్, దమ్మపేట, మార్చి 21 అశ్వారావుపేట నియోజక వర్గ ఉపాధి హామీ కాంట్రాక్ట్ ఉద్యోగులు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుని వారి నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఎస్ఈఆర్పి ఉపాధి హామీ పదకములో 17 సంవత్సరాలుగా పని చేస్తున్న 3874 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు పే స్కేల్ ఇచ్చి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వినతి పత్రము అందజేసారు. ఈ విషయముపై స్పందించిన ఎమ్మెల్యే మెచ్చా ముఖ్య మంత్రి కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్ళి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా ఉపాధి హామీ ఉద్యోగుల జెఏసీ చైర్మన్ వి సుధాకరరావు, కోశాధికారి జిడిఆర్. పట్నాయిక్, టిఏ యూనియన్ కోశాధికారి పి రాఘవరావు మరియు దమ్మపేట , ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, అశ్వారావుపేట మండలాల ఏపిఓలు, ఈసిలు, టిఏలు, కంప్యుటర్ ఆపరేటర్, అకౌంట్ అసిస్టెంట్ లు తదితరులు హాజరు అయ్యారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !