మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
జాతీయ పంచాయతీ అవార్డ్స్ కి 2021- 2022 సంవత్సరానికి గాను దుమ్ముగూడెం మండలంలో 16 గ్రామపంచాయతీలు ఎంపిక అయ్యాయి 9 అంశాలలో గ్రామ పంచాయతీలు చేపట్టిన కార్యక్రమాలను కొలమానంగా తీసుకుని ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలలో ఈ 16 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు జిల్లా స్థాయిలో జాతీయ గ్రామపంచాయతీ అవార్డ్ క్రి చింతగుప్ప గ్రామపంచాయతీ ఎంపిక అయింది ఈ మెరకు శుక్రవారం లక్ష్మీనగరం మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో ఎంపీపీ రేసు లక్ష్మీ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం నిర్వహించి జాతీయ పంచాయతీ అవార్డ్స్ కి ఎంపికైన ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామపంచాయతీ కార్యదర్శులను శాలువాలు కప్పి సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ సన్మాన కార్యక్రమంలో జడ్పిటిసి తెల్లం సీతమ్మ ఎంపీడీవో చంద్రమౌళి ఎంపీ ఓ ముత్యాలరావు ఎంపీటీసీలు గ్రామపంచాయతీ సర్పంచులు కార్యదర్శులు పాల్గొన్నారు.