UPDATES  

 పర్ణశాల పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన అమరావతి జడ్జి..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాముడు వారి అనుసంధానమైన పర్ణశాల పుణ్యక్షేత్రాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి జడ్జి సునీత దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారిని శనివారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికి గర్భాలయంలో ధ్రువ మూర్తులు స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదలను అందించారు అనంతరం స్వామివారి కుటీరలను నార చీరలు ప్రదేశాలను పరిశీలించి వాటి విశిష్టతను తెలుసుకున్నారు. పర్ణశాల పుణ్యక్షేత్రంలో సెలవు దినములు కావడంతో భక్తులు అధిక పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో వారి వెంట దుమ్ముగూడెం పోలీస్ వారు రెవిన్యూ అధికారు ఆలయ ఇంచార్జ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !