మన్యం న్యూస్, భద్రాచలం :
భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతు శాస్త్ర ఒప్పంద అధ్యాపకులుగా పనిచేస్తున్న అంగడాల శ్రీను కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రకటించడం అభినందనీయమని భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డి.భద్రయ్య అన్నారు. సోమవారం భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ను సాధించిన జంతుశాస్త్ర అధ్యాపకులు శ్రీను కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డి.భద్రయ్య మాట్లాడుతూ… భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతు శాస్త్ర ఒప్పంద అధ్యాపకులుగా పనిచేస్తున్న అంగడాల శ్రీను కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రకటించడం అభినందనీయమని అన్నారు. భద్రాచలం కళాశాలలో అధ్యాపకులుగా సేవలు అందిస్తున్న వ్యక్తికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పొందడం వలన కళాశాల ఉన్నతి మరింత పెరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. డాక్టరేట్ సాధించిన అధ్యాపకులు శ్రీను జంతు శాస్త్రం పై ఉన్న అనుభవాన్ని, ప్రతిభను విద్యార్థులకు బోధిస్తూ వారిని సైతం ఉన్నత శిఖరాలకు ఎదిగేవిధంగా మరింతగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం తో పాటు, కళాశాల సిబ్బంది పాల్గొని అధ్యాపకులు శ్రీను ని అభినందించారు.