UPDATES  

 శ్రీ శ్రీ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారి కృపా కటాక్షాలతో అందరూ బాగుండాలి -జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్ ఏప్రిల్ 10

మణుగూరు ఏరియా సింగరేణి కాలరీస్ బంగ్లాస్ పరిధిలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ లలితా
త్రిపుర సుందరి దేవి ఆలయం లో అమ్మ వారి విగ్రహ ప్రతిష్ట జరిగి,అయిదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఏప్రిల్ 8 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న పంచమ వార్షికోత్సవ మహోత్సవం వేడుకలు సోమవారం ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ సతీ సమేతంగా పాల్గొని సుప్రభాత సేవ,పంచామృతా అభిషేకం,గణపతి పూజ, నవగ్రహ,చండీ హోమం వంటి వరుస కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.ఆలయం లో శాస్త్రోత్సంగా జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో కూడా పాల్గొన అనంతరం జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ మాట్లాడుతూ,భక్తి భావం మనల్ని సన్మార్గంలో నడుపుతుంది,సంరక్షిస్తుంది అన్నారు.మనం ఏ పని ప్రారంభించిన దైవాన్ని తలచుకొని ప్రారంభిస్తే,మనతో పాటు మన కుటుంబ సభ్యులకు అంతా మంచే జరుగుతుంది అన్నారు. సింగరేణి కార్మికలు వారి కుటుంబ సభ్యులు ప్రతి రోజు అమ్మవారిని తల్చుకొని దినచర్యను ప్రారంభించాలని, అమ్మ వారి కృప కటాక్షలతో అందరూ బాగుండాలి అని ఆకాంక్షించారు.ఆలయ కమిటీ వారు ప్రత్యేక శ్రద్ధతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాక,పంచమ వార్షికోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించడం పట్ల కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందించారు.ముఖ్యంగా అత్యంత శోభయానముగా భక్తి భావం ఉట్టి పడేలా పూజ కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను ఆలయ కమిటీ సభ్యులను, అలాగే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రూ.10,000/- విరాళముగా అందించిన పికేఓసి ప్రాజెక్ట్ ఇంజినీర్ వీర భద్రుడు వారి కుటుంబ సభ్యులను,తమ కుటుంబ సభ్యుల పేరిట ఉత్సవానికి విచ్చేసిన భక్తజనులందరికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేబట్టిన ఏరియా ఇంజనీర్ మట్ట. నర్సిరెడ్డి,వారి కుటుంబ సభ్యులకు జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఉత్సవ ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్రీ శ్రీ లలిత దేవి ఆలయం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడిన అమ్మ వారి ఊరేగింపు కార్యక్రమంలో సింగరేణి అధికారులు,ఇతర సింగరేణియులు వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జిఎం డి లలిత్ కుమార్,ఏజిఎం సివిల్ డి వెంకటేశ్వర్లు,ప్రాజెక్ట్ మేనేజర్ రాముడు,డాక్టర్ శేషగిరి,మణుగూరు ఏరియాలోని ఇతర అధికారులు వారి కుటుంబ సభ్యులు,భక్తజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !