మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని సస్పెండ్ చేశారు. కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ టార్గెట్ గా ఇద్దరు నాయకులు విమర్శలు చేశారు. ఏప్రిల్ 9న ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పొంగులేటి, జూపల్లిపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసింది.