UPDATES  

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలిసిన…బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి షేక్ అన్వర్

 

కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లి గ్రామం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ను తన స్వగృహమైన కుర్నవల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమకమైన సందర్భంగా షేక్ అన్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా అధికార ప్రతినిధిగా నియమితులైన సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా షేక్ అన్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తానని అన్నారు. తనకి అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. సోషల్ మీడియా కన్వీనర్ యాంపాటి సందీప్ రెడ్డి, పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున ఆయనకు అభినందనలు తెలిపారు…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !