UPDATES  

 ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రవి

మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:గత నెల రోజులుగా పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అత్యంత నియమ నిష్టలతో, భక్తిశ్రద్ధలతో రోజాను పాటిస్తున్న ఇల్లందు పట్టణ ముస్లిం సోదరులకు ఆంబజార్ లోని జామా మసీదులో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి.రవి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. అల్లా దేవుని ఆశీస్సులు పట్టణ ప్రజలందరిపై ఉండాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు ఇస్లాం మతపెద్దలు, కాసిం, పాషా, అక్రమ్, రియాజ్, రంజాన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసిక తిరుమల్, ఇబ్రహీం, ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ అరవిందస్వామి, రవి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !