మన్యం న్యూస్,ఇల్లందు..బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో గురువారం రాష్ట్ర ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో
భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితతో కలిసి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే హరిప్రియను కేటీఆర్ అభినందినట్లు హరిప్రియ తెలిపారు. సంక్షేమ పథకాల్లో మొదటిస్థానంలో ఉన్న బీఆర్ఎస్ కు రానున్న ఎన్నికల్లో ప్రజలు మరోమారు పట్టంకట్టి హ్యాట్రిక్ విజయాన్ని అందించడం ఖాయమని హరిప్రియ పేర్కొన్నారు.