UPDATES  

 పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలి*

మన్యం న్యూస్, మంగపేట.

మంగపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో జూనియర్ ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ కొరకు నిరవధిక సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ మాల మహానాడు ములుగు జిల్లా కమిటీ అధ్యక్షులు రాజమల్ల సుకుమార్ పాల్గొని న్యాయబద్ధమైన కార్యదర్శుల దీక్షకు సంపూర్ణ మద్దతును తెలంగాణ మాల మహానాడు పక్షాన తెలియపరిచినారు. అనంతరం మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా గ్రామాలలో అన్నీ తామే అయి వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రెగ్యురేషన్ చేయాలని 2020 లో విధుల్లో చేరిన పంచాయతి కార్యదర్సులు మూడు సంవత్సరాల కాలపరిమితిని పూర్తి చేసుకున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం 26వ జీవో ఇచ్చి ఇంకొక సంవత్సరం అదనంగా పనిచేయాలని ఆదేశించిన ఆ సంవత్సర కాలాన్ని కూడా విజయవంతం చేసుకుని నాలుగు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల ప్రొఫెషనల్ కాలాన్ని సర్వీసులో కలపాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చిన రథసారథి పంచాయతీ కార్యదర్శుల గోస సమస్య తప్పకుండా పరిష్కరిస్తారని నమ్మకం తమకుందని మాల మహా నాడు ములుగు జిల్లా అధ్యక్షులు రాజమళ్ళ సుకుమార్ తెలియజేశారు.ఈ సమావేశంలో తెలంగాణ మాల మహానాడు జిల్లా అధికార ప్రతినిధి బోడ శ్రీను, మండల అధ్యక్ష కార్యదర్శులు మైప లాలయ్య, నాదరపు విరస్వామి దొడ్డ భాస్కర్ దొడ్డ సాంబశివ రావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !