మన్యం న్యూస్ గుండాల: ఐకెపి లో పనిచేస్తున్న వివో ఎలా న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ మండల కేంద్రంలో బిక్షాటన చేస్తూ వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత 12 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆ సంఘం అధ్యక్షులు జిమ్మిడి సాంబయ్య పేర్కొన్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించే దాకా సమ్మె విరమించేదే లేదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంతారావు, బొమ్మయ్య, రాంబాబు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు
