మన్యం న్యూస్ వాజేడు
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పోషక ఆహార పదార్థాల ప్యాకెట్లను జడ్పిటిసి తల్లడి పుష్పలత, ఎమ్మార్వో గూడూరు లక్ష్మణ్, ఐసిడిఎస్సి సిడిపిఓ ముత్తమ్మ, ఆధ్వర్యంలో శుక్రవారం పంపిణీ చేశారు. సిడిపిఓ ముత్తమ్మ మాట్లాడుతూ ఐ టి డి ఏ పిఓ అంకిత్ ఏటూరు నాగారం ఆధ్వర్యంలో అంగన్వాడి సెంటర్లలో రక్తహీనత ఉన్న పిల్లలకు, పోషక ఆహారం లోపం ఉన్న పిల్లల కొరకు పోషక ఆహార కిట్లు అంగనవాడి సెంటర్లకు పంపించి ప్రతి శిశువు దృఢంగా, రక్తహీనత లేకుండా ఉండేందుకు సహాయపడుతుందనీ వారు అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ రమాదేవి,పుష్పవతి, అంగన్వాడి ఉపాధ్యాయులు,గొంది శ్రీదేవి,అట్టం,స్వరూప, మడప రోజరాణి,విజయ, తదితరులు పాల్గొన్నారు.