డా” బిఆర్. అంబేడ్కర్ 132 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని దళిత జాతిపై జరుగుతున్న సమస్యపై నిత్యం పోరాడుతూ జాతి సమస్యల పరిష్కారానికై హక్కుల సాధనకై అహర్నిశలు పోరాటం చేస్తున్న దళిత నాయకులు రాజమల్ల సుకుమార్ తెలంగాణ మాల మహానాడుజిల్లా అధ్యక్షుడు ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి దళితరత్న, అవార్డును 2023 వ సంవత్సరానికి గాను సంక్షేమ శాఖల మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ రాజమల్ల సుకుమార్కి షీల్డ్ అందజేసి దళితరత్న అవార్డును ప్రధానం చేయడం జరిగింది.
ఇందుకు గాను శుక్రవారం తెలంగాణ మాల మహానాడు మంగపేట మండలం కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత దళిత రత్న అవార్డు గ్రహీత,మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాజమల్ల సుకుమార్ కి శాలువా కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది.
అనంతరం పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ సుకుమారి జిల్లాలో దళిత గిరిజన బహుజన బిడ్డలకు ఏ సమస్య వచ్చినా నిత్యం పోరాటం ద్వారా సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపడంలో అత్యంత కీలక పాత్ర పోషించారని సుకుమార్ లాంటి వ్యక్తికి ఇలాంటి అరుదైన అవకాశం దక్కటం న్యాయమే అని సామాజిక ఉద్యమాలు చేసే వ్యక్తి సుకుమార్ అని భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నతమైన శిఖరాల అధిరోహించాలని వారు అన్నారు.