నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలి.
జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ డా.వినీత్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
చట్టపరంగా నేరస్తులకు శిక్ష పడేలా కృషిచేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సూచించారు శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో ఆయన నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసి భాదితులకు న్యాయం చేకూర్చే విధంగా పోలీసు అధికారులందరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు.అనంతరం పెండింగ్లో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్ ద్వారా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.గంజాయి రవాణా,మట్కా,బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.వ్యవస్తీకృత నేరాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ముందస్తుగా వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.షీ టీమ్స్ ఆవశ్యకత గురించి జిల్లా వ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలియజేసారు.మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు.స్థానికంగా పోలీస్ అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని నిరంతరం సందర్శిస్తూ ఉండాలని,ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టి పోలీస్ శాఖపై నమ్మకాన్ని మరింతగా పెంచాలని కోరారు.మార్చి నెలలో వర్టికల్స్ వారీగా విధులలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు,సిబ్బందికి ప్రసంసా పత్రాలను అందజేశారు.
ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్ డిఎస్పీలురమణమూర్తి,వెంకటేష్,రాఘవేంద్రరావు,రెహమాన్, జిల్లాలోని సిఐలు,ఎస్సైలు,సిబ్బంది పాల్గోన్నారు.