మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మేనెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కొత్తగూడెంలోని అశోక్ నగర్ కాలనీ గ్రౌండ్ నందు 14 సంవత్సరాల లోపు బాల, బాలికలకు తైక్వాండో వేసవి శిక్షణ శిబిరాన్ని నెలరోజులపాటు ఉదయం, సాయంత్రo, నిర్వహించనున్నట్లు, జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, శిక్షకులు ఇ. మొగిలిఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు, శిక్షణలో పాల్గొనదలచిన బాల,బాలికలు 1వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు దరఖాస్తులను సంబంధిత శిక్షకులకు అందజేసి శిక్షణ శిబిరంలో పాల్గొనాలని ఇ .మొగిలి సూచించారు.బాల, బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారి తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించి శిబిరంలో అధిక సంఖ్యలోపాల్గొనే విధంగా సహకరించాలని ఆయన కోరారు నెల రోజులు శిక్షణలో ప్రతిభ కనబరిచిన బాల,బాలికలకు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సర్టిఫికెట్లు అందజేస్తుందని బాల ,బాలికలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా మొగిలి కోరారు.వివరాలకు శిక్షకులు, జిల్లా తైక్వాండో అసోసియేషన్ సెల్ నెంబర్ 9391605282 సంప్రదించాలని ఆయన కోరారు.