థాయ్లాండ్లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జూదం ఆడుతూ.. క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే!
ఈ గ్యాంబ్లింగ్ విషయం తెలిసి మే 1వ తేదీన చౌనబురి ప్రావిన్స్ పోలీసులు ఆ సెంటర్పై దాడులు నిర్వహించి.. ప్రవీణ్ సహా చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో భారతీయులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ కేసులో థాయ్లాండ్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 4500 బాట్స్ జరిమానాతో చికోటి ప్రవీణ్ సహా 83 మంది భారతీయులకు బెయిల్ ఇచ్చింది. అయితే.. జరిమానా కట్టేవరకు పాస్పోర్టులు ఇవ్వొద్దని చెప్పింది. గంట గ్యాప్లోనే ఫైన్ చెల్లించడంతో.. పోలీసులు వారికి పాస్ట్పోర్టులు ఇచ్చి విడుదల చేశారు.