UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 భక్తిశ్రద్ధలతో బొడ్రాయి ప్రధమ మహోత్సవం

  • భక్తిశ్రద్ధలతో బొడ్రాయి ప్రధమ మహోత్సవం
  • బొడ్రాయి ప్రాంగణంలో మురికి నీరు, ఇబ్బందులు పడుతున్న భక్తులు

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 16: మండలంలోని తిరుమలకుంట గ్రామంలో బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి గ్రామదేవతల మొదటి మహోత్సవం గ్రామస్థుల సమష్టి కృషితో మంగళవారం అంగ రంగా వైభవంగా జరిగింది. బొడ్రాయి ప్రధమ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామునే మహిళలు బోనాలతో ఊరేగింపుగా బొడ్రాయి వద్దకు చేరుకొని ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు రోజులు పాటు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. బొడ్రాయి మహోత్సవం సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. అనంతరం మహిళలు, గ్రామస్తులు కుటుంబసమేతంగా భక్తి శ్రద్ధతో తయారు చేసిన బోనాలను పసుపు కుంకుమలతో అలంకరించి, నెత్తిన పెట్టుకొని డప్పు చప్పులతో ఊరేంపుగా తీసుకెళ్లి బొడ్రాయి చుట్టు ప్రదక్షణలు చేసి అక్కడ నుండీ ముత్యాలమ్మ తల్లి దగ్గరికి కాలినడకన వెళ్లి గ్రామదేవతకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తెరాస పార్టీ మండల సెక్రటరీ జుజ్జురి వెంకన్నబాబు దంపతులు, గడ్డం సత్తిబాబు దంపతులు, పల్లెల రామలక్మయ్య దంపతులు, బొడ్దుసత్తిబాబు దంపతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొడ్డు రాయి ప్రాంగణంలో మురికి నీరుతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పలువురు భక్తులు మాట్లాడుతూ బొడ్రాయి మొదటి వార్షికోత్సవం సందర్బంగా ద‌ర్శ‌నానికి వ‌చ్చిన భ‌క్తులు మురికి కాల్వతో ఇబ్బందులు ప‌డుతున్నాము అని, బొడ్రాయి ప్రాంగణంలో మురికి నీరు పోతున్న పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉందని భక్తులు ఆవేదన తెలుపుతున్నారు. ప్రదక్షణలు చేసేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాము అని వెంటనే మురికి కాల్వను శుభ్రంగా చేసి మురికి నీరు రాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !