తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
మణుగూరు ఏరియా లో పర్యటించిన సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్ట్స్,ప్లానింగ్ జి.వెంకటేశ్వర రెడ్డి
మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 28
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్ట్స్,ప్లానింగ్ జి. వెంకటేశ్వర రెడ్డి తెలిపారు.ఈ మేరకు ఆదివారం మణుగూరు ఏరియాలో సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్ట్స్,ప్లానింగ్ జి.వెంకటేశ్వర రెడ్డి పర్యటించారు.ఈ సందర్బంగా మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్,గుర్తింపు సంఘం ఉపాధ్యక్షులు వి. ప్రభాకర్ రావు,సంబంధిత అధికారులతో కలిసి జూన్ 2వ తేదీన అన్ని గనుల డిపార్ట్మెంట్ ల వద్ద జరపబోయే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జూన్ 5వ తేదీన భద్రాద్రి స్టేడియం లో జరిగే తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం భద్రాద్రి స్టేడియం లో చేపట్టే ఏర్పాట్లను పరిశీలించారు.అధికారులకు తగు సూచనలు చేశారు.ఈ సందర్భంగా భద్రాద్రి స్టేడియం నందు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు సింగరేణి ప్రగతికి సంబంధించిన ఫోటోలను సందర్శించుటకై ఫోటో గ్యాలరీనీ సందర్శకులు తిలకించే విధంగా ఏర్పాటు చేయలని అధికారులకు సూచించారు.ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, సందర్శకులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండ అన్ని ఏర్పాట్లు చేయాలని వారు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాలను,పురస్కరించుకొని రెట్టింపు ఉత్పత్తిని మణుగూరు ఏరియా ఉద్యోగులు అందరూ సమిష్టి కృషితో సాధించి మణుగూరు ఉద్యోగుల స్ఫూర్తిని చాటుకోవాలని తెలిపారు. అనంతరం డైరెక్టర్ ప్లానింగ్ జి. వెంకటేశ్వర రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ఓసి-4 వ్యు పాయింట్,కేపియుజి గని ని సందర్శించడం జరిగింది. బొగ్గు ఉత్పత్తి నీ పరిశీలించడం జరిగింది.బొగ్గు ఉత్పత్తి, రవాణాపై అధికారులకు కుల సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏజెంట్ కొండాపురం జి.నాగేశ్వరావు, ఎస్ఓ టు జిఎం డి.లలిత్ కుమార్,ఏజిఎం సివిల్,డి వెంకటేశ్వర్లు,ఏరియా ఇంజనీర్ నర్సిరెడ్డి,ఎడిట్ ఆఫీసర్ పీకే ఓసి టి.లక్ష్మీపతి గౌడ్,మేనేజర్ కొండాపురం బి.వెంకటేశ్వర్ రెడ్డి,మధుసూధన్ రావు, డివై.ఎస్ శోభన్,టీబీజీకేస్ యూనియన్ నాయకులు వీరభద్రం,సీనియర్ పర్సనల్ అధికారి వి.రామేశ్వర రావు, సీనియర్ సెక్యూరిటీ అధికారి అబ్దుల్ షబ్బీరుద్దీన్,సర్వే అధికారి సర్వర్ నబి,ఇతర అధికారులు,తదితరులు పాల్గొన్నారు.





