UPDATES  

 బట్ట భార్గవి కుటుంబానికిఆర్ధిక సహాయం

మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం కొత్తపేట(చేరుపల్లి )గ్రామనికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కొత్తపేట మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు బట్ట నర్సింహారావు కుమార్తె అయినా బట్ట భార్గవి ఇటీవలే మృతి చెందగా గురువారం మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజు యాదవ్ ఆమె దశదిన కర్మలకు హాజరై చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిరూ. 6500 రూపాయిల ఆర్థిక సహాయం అందజేసి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.వారి పవిత్రమైన ఆత్మ కు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, ముఖ్య నాయకులు చిట్టీమల్ల సమ్మయ్య,రామగని నరేందర్ , కొత్తపేట గ్రామ కమిటీ అధ్యక్షులు చిట్టీమల్ల బాలకృష్ణ, తిమ్మంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు యాగ్గడి అర్జున్, బాలన్నగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు పోదేం రాంబాబు,, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి తాటి రాజు ,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, యూత్ నాయకులు రాచకొండ గణేష్, కూకట్ల శ్రీనివాస్, చెన్నూరు సాంబయ్య , ఎర్ర సైదులు,వెంకన్న, ముకుందాం ,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !