UPDATES  

 మండలంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే మెచ్చా

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, జూన్, 25: అశ్వారావుపేట మండలం, గుర్రాలచెరువులో శ్రీశ్రీశ్రీ కనక దుర్గ అమ్మవారు ఆలయం వద్ద మరియు నారాయణపురం కట్ట మైసమ్మ అమ్మ వారి ఆలయం వద్ద జరిగిన ఆషాడ బోనాల మహోత్సవంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఉన్న గ్రామస్థులతో ఆప్యాయంగా మాట్లాడుతూ సమయం గడిపారు. గుర్రాలచెరువు కార్యక్రమంలో వద్ద ఆంధ్రా లో నివాసం ఉండే ఒక వ్యక్తి అక్కడే ఉన్న ఎమ్మెల్యే తో మాట్లాడుతూ తెలంగాణలో మళ్ళీ మీదే అధికారం అండి అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. అలాగే నారాయణపురం కాలని వద్ద గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంచి నీటి సమస్య ఉందని, ఇల్లు, సీసీ రోడ్లు కావాలని గ్రామస్థులు ఎమ్మెల్యే మెచ్చా ని కోరడంతో సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఇల్లు ఇస్తానని, మంచి నీటి సమస్యలు వినాయకపురంలో బోర్ వేసి అక్కడ నుంచి పైప్ లైన్ల ద్వారా మంచి నీరు వచ్చేలా చేయాలని అధికారులను ఆదేశించారు. సీసీ రోడ్లు కూడా త్వరలో ఏర్పాటు చేస్తానని ఇప్పటికీ 2 రోడ్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గుర్రాలచెరువు నుంచి కేసప్పగూడెం వెళ్ళే మార్గం మధ్యలో వంతెన చిన్నగా ఉండటం వరద ఎక్కువ వస్తుందని తెలుసుకున్న ఎమ్మెల్యే మెచ్చా వెంటనే స్పందించి అంచనా వేసి ప్రభుత్వానికి సమర్పించాలని ఫోన్ లో సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, మండల నాయకులు, గ్రామ అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !