రేగులకుంట గ్రామానికి 1 కోటి 58లక్షలతో బిటి రోడ్డు మంజూరు
మన్యం న్యూస్. ములకలపల్లి.జూన్27.
ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు అంటే ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆలోచనతో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముందుకు సాగుతున్నారు.నియోజకవర్గం ఏర్పడి ఎండ్లు గడిచిన అభివృద్ది అనేది శూన్యంగా ఉండేది.ఎమ్మెల్యే గా మెచ్చా నాగేశ్వరరావు గెలిచాక నియోజకవర్గంలో అనేక మారుమూల ప్రాంతాల్లో పర్యటించి అక్కడ అభివృద్ది పనులకు శ్రీకారం చుడుతున్నారు.అందులో భాగంగా ఈరోజు మండలలం లోని రేగులకుంట గ్రామంలో మెచ్చా నాగేశ్వరరావు అధికారులతో కలిసి పర్యటించి ప్రత్యేకంగా గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అక్కడే ఉన్న సంబంధిత శాక అధికారులను సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.అదే గ్రామంలో కొండ్రు ప్రసాద్ అనే యువకుడు తెలియని జబ్బుతో బాధ పడుతున్నారని స్థానికులు ఎమ్మెల్యే తేలుపడంతో వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించి 15000 రుపాయల. ఆర్థిక సహాయం అందించారు.పెన్షన్ ఏర్పాటు చేస్తానని వారికి తెలిపారు.ఇదే క్రమంలో ఒకొక్క సమస్య పరిష్కారం అవుతూ గ్రామ రూపు రేకలు మారుతున్న సందర్భంగా గ్రామంలోని ఒక మహిళ ఆనందబాష్పాలతో ఎమ్మెల్యే వద్దకు వచ్చి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్ రూం ఇండ్ల వద్ద అక్కడ నివాసం ఉండే వారితో సమావేశమైనారు ముందుగా మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్యేగా కృషి తో ఇండ్లు మంజూరు చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకొని సంబంధిత శాఖ అధికారులను పరిష్కరించాలని ఆదేశించారు.రోడ్డు కావాలని,బృహత్ ప్రకృతి వనం నుంచి వచ్చే వరద వల్ల ఇబ్బందిగా ఉందని,ఇండ్ల కరెంట్ మీటర్ పేర్లు మార్చడం మరియు డ్రైనేజ్ ఏర్పాటు గురించి సమస్యలు తెలిపారు.సంబంధిత శాఖ అధికారులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ 14 ఎండ్లు పోరాడి మనకోసం తెలంగాణ రాష్ట్రం సాధించారని,కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనని,ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలుగా మన నియోజకవర్గానికి మనకి అండగా ఉన్నారని. సమస్య ఉంది అన్న వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారని,ఈరోజు ముఖ్యమంత్రి సహకారంతోనే మన నియోజకవర్గంలోని అనేక మారుమూల ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ది చేయడం జరిగిందినీ.అందులో బాగంగా రెగులకుంట గ్రామానికి 1కోటి 58లక్షలతో బిటి రోడ్డు మంజూరు చేయించడం జరిగిందనీ, సుమారురూ. 10లక్షల.రుతో సీసీ రోడ్లు వేయడం జరిగిందనీ.గ్రామంలో ని 37 మందికి పోడు భూమి పట్టాలు మంజూరు చేయించడం జరిగిందనీ, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని.ఎలాంటి సమస్య ఉన్న వెంటనే తనకు తెలియజేస్తే తద్వారా వెంటనే పరిష్కరించడం చేస్తనాని అన్నారు.ఈ కార్యక్రమంలోసంబంధిత మండల అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
