UPDATES  

 అంగన్వాడీ సిబ్బందిని బిఎల్వో విధుల నుంచి మినహాయించాలి

  • అంగన్వాడీ సిబ్బందిని బిఎల్వో విధుల నుంచి మినహాయించాలి
  • బిఎల్వో విధుల బకాయి వేతనాలు తక్షణమే విడుదల చేయాలి
  • ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంచర్ల జమలయ్య
  • ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

అంగన్వాడీ సిబ్బందిని బి ఎల్ ఓ విధుల నుంచి మినహాయించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కంచర్ల జమలయ్య డిమాండ్ చేశారు. బిఎల్వో విధుల నుంచి అంగన్వాడీ సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలని, ఈ విధులకు సంబందించి బకాయి అలవెన్సులు, వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి అనుబంద అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి జమలయ్య మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందిని బిఎల్వో విధులకు నియమిస్తూ పనిభారం మోపుతున్నారన్నారు. అదనపు విధులతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందని, కేంద్రాల ఏర్పాటు లక్ష్యం నిరుగారిపోతోందని అన్నారు. టీచర్లకు బిఎల్వో విధులు కేటాయించి ఐదేళ్ళపాటు ఊడిగం చేయించుకొని కేవలం 2021కి సంబందించి రూ.4,500లు చెల్లించి చేతులు దులుపుకున్నారన్నారు. నాలుగు సంవత్సరాలకు సంబందించి బిఎల్వో వేతనాలు విడుదల శ్రమను దోచుకున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో బిఎల్వో విధులు నిర్వహిస్తున్న టీచర్లకు ఏడాదికి రూ.6 వేల గౌరవ వేతనం, ఇంటింటి సర్వేకు రూ.వెయ్యి, టీఏ-డీఏ బిల్లులులతోపాటు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేసినందుకు రూ.1,150లు చెల్లించాలని నిబందన ఉన్నప్పటికి చెల్లించకుండా జాప్యం చేస్తున్నారన్నారు. బిఎల్వీలకు సంబందించి గరుడ యాప్ వినియోగానికి స్మార్ట్ఫోన్, సిమ్, నెట్ ఛార్జీలు అతీతగతి లేకుండా పోయాయన్నారు. తక్షమే బిఎల్వోకు చెల్లించాల్సిన బకాయి వేతనాలు, బిల్లులు విడుదల చేయాలని, అదేవిదంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ఆటంకంగా మారిన బిఎల్వో విదుల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోషియేషన్ జిల్లా నాయకులు గోనె మణి, రూపా, ప్రమీల, సరోజ, ప్రతిభ, భాగ్య, మంగతాయి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !