మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
మిరప, కూరగాయల నారు విక్రయాల్లో నర్సరీ దారులు నాణ్యత పాటించాలని తద్వారా మంచి
దిగుబడి వస్తుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో ఉద్యాన, వ్యవసాయశాఖ ఆద్వర్యంలో మిరప,కూరగాయల నారు పెంచే నర్సరిదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారం లైసెన్సు దారులు మాత్రమే నర్సరీలు నిర్వహించాలని, లైసెన్సులు లేకుండా నర్సరీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జిల్లాలో 33 నర్సరీలు నిర్వహిస్తున్నారని రైతులు లైసెన్సు పొందిన నర్సరీ దారుల నుండి మాత్రమే నారు
కొనుగోలు చేయాలని చెప్పారు. అమ్మకాలు, కొనుగోళ్లు పకడ్బందిగా లెక్క ప్రకారం జరగాలని చెప్పారు.కొనుగోలు దారులకు తప్పక రశీదు ఇవ్వాలని ఇవ్వాలని, స్టాకు వివరాలు ప్రదర్శింప చేయాలని చెప్పారు.వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని సూచిస్తూ అక్రమాలకు పాల్పడొద్దని హెచ్చరించారు. నర్సరీలలో మేలైనయాజమాన్య పద్ధతులు, సూచనలు మరియు నర్సరీల నిర్వహణ నియమ నిబంధనలు పాటించాలని చెప్పారు.
వ్యవసాయశాఖ ద్వారా ఆమోదం పొందిన రకాల నారును పెంచాలని చెప్పారు. ఆరుబయట పెంచే నారునుకొనుగోలు చేయొద్దని, ఆ విధంగా నారు పెంచడానికి అనుమతులు లేవని ఆయన పేర్కొన్నారు. టాస్క్ ఫోర్సుసిబ్బంది తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. నర్సరీ నియమ నిబంధనలు పాటించని వారిపై, నకిలీ విత్తనాలు,
నారు విక్రయించే వారిపై పిడి యాక్టు నమోదు చేయనున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటించకపోతే జైలుశిక్ష తప్పదని, చట్ట ప్రకారం 50 వేలు జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష లేదా రెండు విధిస్తామని చెప్పారు.నకిలీనారు, విత్తనాలు అమ్మడం, గడువు తీరినవి అమ్మడం, లైసెన్సు లేకుండ విక్రయాలు చేయడం, హెచ్ఐవిత్తనాలు అమ్మడం, ఒకరి లైసెన్సు మీద ఇంకొకరు, ప్రాంతాలు మార్చి, పేర్లు మార్పుతో విక్రయాలు చేయడం నిషేదమని చెప్పారు. లైసెన్సులు ప్రదర్శించకపోవడం, బిల్లు ఇవ్వకపోడం, స్టాకు రిజిష్టరు నిర్వహించకపోవడం సవరించే అవకాశం ఉన్న పొరపాట్లని, అటువంటి పొరపాట్లుకు తావులేకుండా పకడ్బందిగానిర్వహించాలని పేర్కొన్నారు. రైతులకు ఆరోగ్యవంతమైన, నాణ్యమైన నారును అందించడం వల్ల అధిక
దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. నారు ధృడంగా ఉంటేనే మొక్క ఆరోగ్యవంతంగాపెరుగుతుందని చెప్పారు. ఉద్యానపంటలకు మన జిల్లా ప్రసిద్ది అని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని
ఆయన చెప్పారు. నకిలీ విత్తనాలు, నారు విక్రయించే వ్యక్తుల సమాచారం అందచేయాలని, వారి వివరాలనుగోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. తదుపరి ఉత్తమ రైతు, నర్సరీ నిర్వహణదారు పాపారావునుశాలువాకప్పి అభినందించారు.ఈ సమీక్షా సమావేశంలో ఉద్యాన అధికారి జినుగు మరియన్న, వ్యవసాయ అధికారి అభిమన్యుడు,ఏడిఏ లాల్చంద్, కెవికే శాస్త్రవేత్తలు నారాయణమ్మ, శివ, నర్సరీ యజమానలు తదితరులు పాల్గొన్నారు.