UPDATES  

 పొంగులేటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి

మన్యం న్యూస్ , పినపాక
జూలై రెండవ తేదీన పొంగులేటి బహిరంగ సభను విజయవంతం చేయాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉడుముల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఏడూళ్ళ  బయ్యారం క్రాస్ రోడ్ లో గల జివిఆర్ ఫంక్షన్ హాల్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ సమక్షంలో జులై 2 తారీఖున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి చేరుతున్నారని తెలియజేశారు. దేశంలో రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని, ప్రభుత్వం వచ్చాక పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేకూరుతుందని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాక ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తాయని అన్నారు. బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి గ్రామం నుండి పొంగులేటి అభిమానులు భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో పొట్లపల్లి ఉప సర్పంచ్ కస్తూరి లింగయ్య ,  పేరం వెంకటేశ్వర్లు, ఉడుముల రవి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ కొమరం రాములు,సమ్మయ్య,  నవాతి శ్రీను, బండారు సాంబయ్య, రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !