UPDATES  

 తెలంగాణ జన గర్జన సభను జయప్రదం చేయండి.

మన్యం న్యూస్ కరకగూడెం: జులై రెండవ తేదీన ఖమ్మంలో జరిగే తెలంగాణ జన గర్జన సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగే జన గర్జనను విజయవంతం చేయాలని ఆయన అన్నారు. అలాగే ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే,కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ,టి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ అధ్యక్షులు నాగబండి. వెంకటేశ్వర్లు, యువజన నాయకులు కునుకుసోత్ సాగర్ పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !