మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి.
బక్రీద్ వేడుకలు హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ కరకగూడెం: కరకగూడెం మండల కేంద్రంలోని జామా మసీదు నందు బక్రీద్ పండగ పురస్కరించుకొని జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు హాజరై ముస్లిం సోదరులకు బక్రీదు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని అన్నారు.ముస్లిం ఆడపిల్లలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచేలా షాది ముబారక్ పథకం ద్వారా ఒక్క లక్ష నూట పదహారు రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నారని దేశం లో ఎక్కడ ఇలాంటి పథకం లేదని తెలిపారు.అంతే కాకుండా విద్య కోసం మైనార్టీ పాఠశాలను ఏర్పాటు చేసి వారి చదువుకు భరోసా అందిస్తున్నారని అన్నారు. దేశంలో మైనారిటీ పాఠశాలల ఏర్పాటు చేసి తెలంగాణ మోడల్ గా నిలిచిందని ఇటీవల ఒక నివేదిక కూడా తెలిపినట్లు ఆయన తెలిపారు.దేవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండగ జరుపుకుంటున్నారని తెలిపారు.భక్తి భావం విశ్వాసం కరుణ ఐక్యతకు సాంకేతమైన ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
అల్లా ఆశీస్సులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగం ప్రజలందరికీ ఎల్లప్పుడు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అభిలాషించారు.అల్లా దయతో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.
