రద్దీని దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లతోపాటు మరికొన్ని ప్రత్యేక రైళ్లను కొన్నాళ్లు పొడిగించింది.
విశాఖపట్నం-సికింద్రాబాద్, విశాఖపట్నం-మహబూబ్నగర్, విశాఖపట్నం-తిరుపతి, భువనేశ్వర్-తిరుపతి మార్గాల్లో నడుస్తున్న ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ పొడిగించింది. ఈ రైళ్ల టైమింగ్స్ తోపాటు ఏయే స్టేషన్లలో ఆగుతాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నెం. 08579 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు. జులై 5 నుంచి జులై 26 వరకు పొడిగించారు. ప్రతి బుధవారం రాత్రి 7.00 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 9.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.నెం. 08580 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు. జులై 6 నుంచి జు లై 27 వరకు పొడిగించారు. ప్రతి గురువారం రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 9.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి.
నెం. 08585 విశాఖపట్నం నుంచి మహబూబ్నగర్ వరకు. జులై 4 నుంచి జులై 25 వరకు పొడిగించారు. ప్రతి మంగళవారం సాయంత్రం 5.35 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్నగర్ చేరుకుంటుంది.నెం.08586 మహబూబ్నగర్ నుంచి విశాఖపట్నం వరకు. జులై 5 నుంచి జూలై 26 వరకు పొడిగించారు. ప్రతి బుధవారం సాయంత్రం 6.20 గంటలకు మహబూబ్నగర్లో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. దువ్వాడ, అన్నవరం సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ, మల్కాజిగిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్నగర్, జడ్చర్ల స్టేషన్లలో ఆగుతాయి.
నెం. 08583 విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు. జులై 3 నుంచి జులై 31 వరకు పొడిగించారు. ప్రతి సోమవారం రాత్రి 7.00 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.నెం. 08584 తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు. జులై 4 నుంచి ఆగస్ట్ 1 వరకు పొడిగించారు. ప్రతి మంగళవారం రాత్రి 9.55 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 10.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.
నెం. 02809 భువనేశ్వర్ నుంచి తిరుపతి వరకు. జులై 1 నుంచి జూలై 29 వరకు పొడిగించారు. ప్రతి శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు భువనేశ్వర్లో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 10.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.నెం. 02810 తిరుపతి నుంచి భువనేశ్వర్ వరకు. జులై 2 నుంచి జులై 30 వరకు పొడిగించారు. ప్రతి ఆదివారం రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాత రోజు సాయంత్రం 5.25 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. ఖుర్దారోడ్, బలుగాన్, బ్రహ్మాపూర్, పలాస, శ్రీకాకుళం, విజయనగరం, దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, ఒంగోలు, గుడ్డూరు, నెల్లూరు, గూడూరు రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. వీటికి ఇప్పటికే రిజర్వేషన్ ప్రారంభమైంది.