UPDATES  

 ఇరవెండి గ్రామ పంచాయతీ ప్రజలం కెసీఆర్ కి రుణపడి ఉంటాం.

 

మన్యం న్యూస్ బూర్గంపహడ్:- పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పాల్వంచ లోని సుగుణ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ హరీష్ రావు సమక్షంలో పలువురు లబ్ధిదారులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు ఈ క్రమంలో ఇరవెండి గ్రామపంచాయితికి చెందిన రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేయడం పై హర్షం వ్యక్తం చేశారు,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి పోడు ప్రజలు రుణపడి ఉంటారని ఆ గ్రామ పంచాయతీ మాజీ ఎంపీటీసీ సభ్యులు వళ్లురుపల్లి వంశీ తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోర్సా లక్ష్మి,ఎంపిఓ సునీల్ కుమార్,పంచాయితి కారదర్శి దివ్య రైతులు సోడే గోపయ్య,కనితి లింగయ్య,ఇర్ఫా తారా దేవి,భూక్య రాములు,నూపా మణి,కేలోతు దుర్గ,లకావత్ గోపాల్,ధనసరి పోతురాజు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !