మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన గ్రూప్ ఫోర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. ఈ మేరకు ఆయన
లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఎస్ ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గ్రూప్ ఫోర్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో 77 కేంద్రాలలో 26910 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉన్నదని చెప్పారు. ఉదయం నిర్వహించిన మొదటి పేపర్ పరీక్షకు 5194 మంది గైర్హాజరయినట్లు చెప్పారు. అలాగే సాయంత్రం నిర్వహించిన పేపర్ 2 పరీక్షకు 5328 మంది గైర్హాజరు అయినట్లు చెప్పారు. పరీక్ష ప్రశాంతంగా జరగడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ నిర్వహణలో బాగస్వాములైన అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని అభినందించారు.