మన్యం న్యూస్, అశ్వారావుపేట, జులై, 21: గ్రామపంచాయతీ కార్మికులకు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ అశ్వారావుపేటలో గ్రామపంచాయతీ కార్మికులు జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం సమస్య లతో కూడిన వినతి పత్రాన్ని దున్నపోతు కు అందచేసి నిరసన వ్యక్తం చేసారు. జెఎసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్మికుల సమస్యల పరిష్కారానికి చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 16 వ రోజుకు చేరిందని అయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. గ్రామపంచా యతీ కార్మికులందరూ తమ హక్కలను సాధించుకునేందుకు పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.