- సీఎం కేసీఆర్ తోనే దేశ రాజకీయాలలో వెలుగులు
- ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మన సంక్షేమ పథకాలు …. ప్రభుత్వ విప్ రేగ కాంతారావు
- బీఆర్ఎస్ పార్టీలో చేరిన 20 కుటుంబాలు… ఆహ్వానించిన రేగా కాంతారావు
మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో భద్రాచలం నియోజకవర్గం చర్ల మండలానికి చెందిన పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నుంచి సుమారు 20 కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగ కాంతారావు గారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీతోనే దేశఅభివృద్ధి సాధ్యమని అన్నారు, ఎలా ఉంటుందో తెలియని అభివృద్ధిని తెలంగాణ ప్రజలకు పరిచయం చేసింది సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీయేనన్నారు.
దేశ ప్రజల ఆకాంక్షతోనే బిఆర్ఎస్ ఉద్భవించింది అని బిఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాలలో ప్రకంపనాలు సృష్టించింది అన్నారు, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధినే దేశమంతా ఆచరిస్తుందఅన్నారు. సీఎం కేసీఆర్ సాధ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు అన్నారు రాష్ట్రాన్ని సమగ్ర భివృద్ధి చేసి అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తున్న సీఎం కేసీఆర్ వెంటనే రాష్ట్ర ప్రజలు ఉన్నారని తెలిపారు
కాంగ్రెస్ నాయకులు రైతులను ముంచేల పూటకు ఒక మాట మాట్లాడుతున్నారని వాళ్ళని నమ్మితే మళ్ళీ కష్టాలు పడాల్సిందే అని అన్నారు, కాంగ్రెస్ పాలనలో రైతులు హరిగోశలు పడ్డారని కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలిసేది కాదని పిండి బస్తాలు విత్తనల బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టేవారని గుర్తు చేశారు.తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడలేని విధంగా రైతు సంక్షేమ పథకాలు తీసుకోవచ్చారని ఉచితంగా 24 గంటల కరెంటు సాగునీరు రైతుబంధు రైతు భీమా సకాలంలో ఎరువులు విత్తనాలు అందిస్తున్నారని వివరించారు గ్రామాలలో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తున్నామని చెప్పారు పేదల కోసం పింఛన్లు కళ్యాణ లక్ష్మి కులవృత్తులను వెనదన్నుగా తెలుస్తున్నాయని విషయాలను ప్రజలకు తీసుకువెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బోదేబోయిన బుచ్చయ్య , చర్ల మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు , మండల ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ తుర్రం రవికుమార్, పార్టీ నాయకులు సీతాపతి రాజు, జోగిరాజు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.