మన్యం న్యూస్ దుమ్మగూడెం జులై 24::
మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య చేతుల మీదగా సోమవారం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన 38 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి,తాసిల్దార్ మణిధర్, ఎంపీడీవో ముత్యాలరావుతో పాటుగా ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది,నాయకులు తదితరులు పాల్గొన్నారు.