UPDATES  

 ఉరి తో నిరసన తెలిపిన జేఏసీ కార్మికులు

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, జులై, 24: రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ గ్రామపంచాయతీ కార్మికులు జెఎసి ఆధ్వర్యంలో అశ్వారావుపేట గ్రామపంచాయతీ కార్మికులు రాష్ట్ర (జేఏసీ) కమిటీ పిలుపు మేరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 19వరోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులందరూ పురుకోసలతో ఉరి పెట్టుకొని నిరసన తెలియజేశారు. అనంతరం జేఏసీ నాయకులు మట్లకుంట కామేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఏ మాత్రం కార్మికులను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు గ్రామపంచా యతీ కార్మికులందరూ తమ హక్కలను సాధించుకునేందుకు సమ్మెను పోరాటాల ద్వారా ఉధృతం చేస్తా మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (జేఏసీ) మండల అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి వెంకటప్పయ్య, కేసుపాక నరసింహారావు, గౌరవాధ్యక్షులు మట్లకుంట కామేశ్వరరావు, మూల అప్పన్న, మండల ట్రెజరర్ వేల్పుల ముత్తారావు, మండలకమిటీ సభ్యులు, మురళి, ఆరేపల్లి, నాగేంద్రరావు, కట్ట శీను, రంజిత్ సింగ్, బాణాల వరలక్ష్మి, అల్లాడి ధనమ్మ, బద్దే లక్ష్మిపద్మ, జ్యోతి రాణి, శ్యామ్, రమాదేవి, స్వప్న, రాధాకృష్ణ, ఇంద్ర, రాణి, నాగమణి, మరియమ్మ, రాము తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !