- అడవి బిడ్డలకు వందనం.
- దింసా నృత్యాలతో ఆడిపడిన గిరిజన బిడ్డలు.
- ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా.
పాల్గొన్న గిరిజన సంఘాల నాయకులు.
మన్యం న్యూస్ భద్రాచలం:-ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఆదివాసి దినోత్సవ వేడుకలను నిర్వహించారు.ఇతిహాస,నాగరికత,సంస్కృతి సాంప్రదాయాలను పాటించడంలో నిలువుటద్దం ఆదిమవాసుల గిరిజనులను ఆదర్శంగా తీసుకుంటే ప్రపంచ దేశ జనాభా సంస్కృతి,సాంప్రదాయాలు పాటించి ఆదివాసి తెగ అంతరించిపోకుండా కాపాడుకున్న వారమవుతామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అన్నారు.బుధవారం భద్రాచలంలోని ఆదివాసి గిరిజన భవనంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరైనారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు,గంటల దొర,మల్లు దొర ఎందరో ఆదివాసుల ప్రాణ త్యాగాల ఫలితంగా 1982వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి నెదర్లాండ్ లో ఆదివాసీలు స్వేచ్ఛ స్వాతంత్ర్యంగా జీవించడానికి 140 దేశాల ప్రతినిధులు పాల్గొని ప్రపంచ ఆదివాసి దినోత్సవంగా ఆగస్టు 9వ తేదీ నాడు తీర్మానం చేసినందున,ఆరోజు నుండి ప్రపంచం మొత్తం మంది ఆదివాసి తెగల గిరిజనులు వారి వారి సంస్కృతి సంప్రదాయాల పరంగా పండుగల ఆదివాసి దినోత్సవం జరుపుకుంటున్నారని అన్నారు.ప్రపంచంలో 7 భాషలు ఉన్నాయని 90 శాతం భాషలు ఆదివాసి కి సంబంధించిన వని,భాషలు లేని ఆదివాసీలు 5 శాతం మాత్రమే ఉన్నారని ఆదివాసీలు తక్కువ మంది మాత్రమే భాషలో మాట్లాడతారని ఇలా ఉండడం వల్ల మన భాష సంస్కృతి సంప్రదాయాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని అన్నారు.దాదాపు పది కోట్ల మంది జనాభా తెలుగు మాట్లాడతారని,అమెరికా దేశం వారు కూడా తెలుగు నేర్చుకొని మాట్లాడడానికి ప్రయత్నిస్తారని,అయినా వారి సాంప్రదాయాన్ని భంగం కలిగించుకోరని ఆదివాసి కుటుంబాలు వారి పిల్లలకు చిన్నప్పటినుంచి సంస్కృతి సాంప్రదాయాలు భాషలోని ప్రాముఖ్యతను తల్లిదండ్రులు నేర్పించాలని అన్నారు.ఆదివాసి గిరిజనులకు ఏ సమస్య వచ్చినా నేరుగా తనకు సంప్రదించవచ్చని,ఆదివాసి గిరిజనుల కోసం తప్పనిసరిగా వారి జీవనోపాధికి కృషి చేస్తానని అన్నారు.అంతకుముందు ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ మరియు సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్,ఐటిడిఏ పరిపాలన అధికారి భీమ్ మరియు వివిధ ఆదివాసి సంఘాల నాయకులతో కలిసి స్థానిక అంబేద్కర్ కూడలి దగ్గర ఉన్న ఆదివాసి తెగల గిరిజనుల కోసం పోరాడిన అమరవీరుల స్థూపాలకు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసి గిరిజనుల పిల్లల కొరకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఆశ్రమ పాఠశాలలు,వసతిగృహాలు గురుకుల పాఠశాలలు నెలకొల్పి వారి విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని,గిరిజనులు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక చేకూర్పు చేసుకొని జీవించడానికి ఐటిడిఏ ద్వారా అనేక రకాల సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజనులకే అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.జిల్లా కలెక్టర్ మరియు పిఓగా కొత్తగా బాధ్యతలు స్వీకరించినందున గిరిజనులకు సంబంధించిన ఏ సమస్య ఉన్న మా దృష్టికి తీసుకొని రావాలని అన్నారు.అనంతరం గిరిజన భవన్లో ఏర్పాటుచేసిన ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన నృత్యాలను వారు తిలకించారు.ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి మరియు వివిధ గిరిజన సంఘాల నాయకులకు సన్మానించారు.అలాగే పదో తరగతిలో ఏ గ్రేడ్ సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అంకంపాలెం హెచ్ఎం వెంకటేశ్వర్లు,గొల్లగూడెం ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి కి ప్రత్యేకంగా ఐసిడిఏపీఓ సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ,ఏసీఎంఓ రమణయ్య,ఏటిడిఓ నరసింహారావు,ఎక్స్ ఎంపీ మీడియం బాబురావు,గిరిజన సంఘాల నాయకులు పూణే కృష్ణ దొర,పాయం రవి వర్మ,శరత్ బాబు,మురళి,రమేష్,పుల్లయ్య,వీరస్వామి,శ్రీరామ్ మూర్తి,సుధారాణి,అరుణ,వెంకటరావు,వీరభద్రం వివిధ గ్రామాల నుండి వచ్చిన గిరిజన సంఘాల నాయకులు,పాఠశాల విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.