మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 15: అశ్వారావుపేట తహశీల్దార్ గా కృష్ణ ప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పక్షాల నాయకులు ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు.