మన్యం న్యూస్, గుండాల:యువత సన్మార్గంలో నడిచి, లక్ష్యం, పట్టుదల తో ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థితిలో ఉండాలని గుండాల సీఐ రవీందర్, ఎస్సై కిన్నర రాజశేఖర్ సూచించారు. మండలం పరిధిలోని వెన్నెల బైలు గ్రామంలో వారు పర్యటించి అక్కడ యువతకు వాలీబాల్ కిట్టును అందించారు అనంతరం వారు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండాలని సూచించారు. అసాంఘిక శక్తులకు సహకరించకుండా ప్రలోభాలకు గురికాకుండా ఉండాలన్నారు. గ్రామంలోని యువతకు పోలీస్ విధాలుగా ఉద్యోగాలు సాధించడంలో తమ వంతు తోడ్పాటు అందిస్తామని కార్యక్రమంలో గుండాల కిన్నెర రాజశేఖర్, కాచన పల్లి ఎస్సై గిరిధర్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
