ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు శుభాకాంక్షలు తెలిపిన మణుగూరు బిఆర్ఎస్ నాయకులు
మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 22
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను మణుగూరు మండల బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో మణుగూరు మండల బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి నవీన్,నాయకులు,యాదగిరి గౌడ్,వట్టం రాంబాబు,నూకారపు రమేష్,కత్తి రాము,బాబీ జాన్,తాత రమణ,రమేష్,పవన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.