UPDATES  

 జీవ వనరుల కేంద్రము ప్రారంభించిన నాబార్డ్ సి జి ఎం

జీవ వనరుల కేంద్రము ప్రారంభించిన నాబార్డ్ సి జి ఎం

మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 23: మండల పరిధిలోని పండువారి గూడెంలో నాబార్డ్ నిధులతో నిర్మించిన జీవ వనరుల కేంద్రాన్ని నాబార్డ్ సిజిఎం సుశీల చింతల బుదవారం ప్రారంభించారు. మల్లాయిగూడెం జీవ కమిటీ, వాసన్ ఆధ్వర్యంలో గోమూత్రం, గోవుపేడ, పుట్ట మట్టి, పప్పుదినుసులు పిండి, నీరు లను మిశ్రమంతో జీవామృతం చేసే యూనిట్ ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. సేంద్రీయ సాగు ఆరోగ్య వంతమైన వ్యవసాయమని, ఆ దిశగా రైతులు ఆలోచన చేయాలన్నారు. ప్రతీ రైతు ఈ సాగు వైపు మారిపోతే అశ్వారావుపేట ఐశ్వర్యపేట గా మారుతుందన్నారు. ప్రతి రైతు ఒక వైద్యులుగా మారి మంచి ఆరోగ్యం అందించాలన్నారు. భూమికి పోషకాలు అందించి ఆరోగ్యవంతమైన నేలగా మార్చాలని సూచించారు. ఈ ప్రాంత నేలలు సారవంతం మైన నేలలు అని అన్ని రకాల పంటలకు అనువుగా ఉన్నాయన్నారు. నేలను కాపుడుకుంటే ముందు తరాల పిల్లలు భవిష్యత్ మంచిగా ఉంటుందని, నాటి మన పూర్వీకుల ఆరోగ్యం, నేటి మన ఆరోగ్యం ఎలా ఉందో మనకు తెలుసునని, భవిష్యత్ లో ముందు తరం వారి పరిస్థితి గురించి ఆలోచించాలని రైతులకు చుసించారు. ప్రకృతి వ్యవసాయం చేసి పంట మార్పిడి తీసుకు వస్తారనే నమ్మకం కలిగిందన్నారు. అంతరం గవర్నర్ దత్తత గ్రామమైన గోగులపుడి కొండరెడ్డి లకు పిండి మిల్లు పంపిణీ చేశారు. మొక్కలు నాటారు. దేశీయ విత్తనాలు, ఆర్గానిక్ కూరగాయలు, వ్యవసాయ పనిముట్లు ప్రదర్శించారు. ఈ కార్యక్రమం లో డీజీఎం శ్వేత సింగ్, ఉబయ జిల్లాల నాబార్డ్ అధికారి సుజిత్ కుమార్, వ్యవసాయ కళాశాల అసిటెంట్ ప్రోఫిసర్స్ వెంకన్న, రెడ్డి ప్రియ, వాసన్ ప్రతినిధి సతీష్ కుమార్, దార ప్రసాద్, కొర్రి మల్లయ్య, రాము, దుర్గారావు, ఆర్ పి పెరుబాయిన శ్రీను, బాబులరెడ్డి, దుర్గా రెడ్డి, సీత, ముత్యాలు, కన్నం రాజు, మరో 32 మంది రైతులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !