UPDATES  

 బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఎంపీపీ

మన్యం న్యూస్, పినపాక:

మండల పరిధిలోని జానంపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయంను పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ గురువారం నాడు ప్రారంభించారు. బిఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు, సంక్షేమ ఫలాలు గురించి ప్రజలకు మరింత వివరించడం కోసం, అదేవిధంగా జానంపేట పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ అభిమానుల, ప్రజల కోరిక మేరకు పార్టీ కార్యాలయంను నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో స్థాపించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిన రెండు చెక్కులను జానంపేట గ్రామానికి చెందిన లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, సర్పంచ్ మహేష్, ఎంపీటీసీ కాయం శేఖర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మొగిలిపల్లి నరసింహారావు, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, ఉప సర్పంచ్ రాయల సత్యనారాయణ, పార్టీ సీనియర్ నాయకులు దాట్ల వాసు బాబు, పిఎసిఎస్ డైరెక్టర్ కామేశ్వరరావు, బుల్లి బాబు, బోడ ఈశ్వర్, గాండ్ల అశోక్, పార్టీ కార్యకర్తలు అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !