మన్యం న్యూస్,మణుగూరు: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.మణుగూరు మండలం లోని గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు బైరి శ్రీనివాస్ సింగరేణి సంస్థలో 39 సంవత్సరాలపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేడుకల్లో బైరి శ్రీనివాస్ ని శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ బైరి శ్రీనివాస్39 సంవత్సరాలు ఎంతో నిబద్ధతగా సింగరేణిలో విధులు నిర్వర్తించడం అభినందనీయమన్నారు.మిగతా ఆయన శేష జీవితం సుఖ సంతోషాలతో గడవాలని ఆకాంక్షించారు.