- బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోలిన లంక రాజు
- నియామక పత్రాలు అందజేసిన బాలసాని లక్ష్మీనారాయణ
- హర్షం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ, యూత్ నాయకులు
చర్ల మండల బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా పోలిన లంక రాజు ను నియమిస్తూ భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జ్ బాలసాని లక్ష్మీనారాయణ నియామక పత్రాలను పోలిన లంక రాజుకు అందించడం జరిగింది. నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్ ఇటీవలే అనారోగ్యం తో మృతి చెందడంతో చర్ల బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పదవి పోలిన లంక రాజును వరించింది. బి. ఆర్.ఎస్ మండల ప్రధాన కార్యదర్శిగా లంక రాజును నియమించిన పట్ల మండల కమిటీ సభ్యులు గొమ్ముగుడెం సర్పంచ్ పోడియం మురళి, కేశపురం సర్పంచ్ కొరం నాగేంద్ర, ఉప సర్పంచ్ గోసుల మురళి, యూత్ నాయకులు బోళ్ల వినోదు, ఆలం ఈశ్వర్, రామగిరి అరుణ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.