UPDATES  

 మీ-సేవా నిర్వహకుల సమస్యలు పరిష్కరించాలి….

 

మన్యం న్యూస్ చండ్రుగొండ, ఆగస్టు 31: మీ-సేవాలపై ఆధారపడి జీవిస్తున్న నిర్వహకుల సమస్యలను పరిష్కరించాలని మండల మీ-సేవా నిర్వహకులు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మండల మీ-సేవా నిర్వహకుల కమిటీ ఆద్వర్యంలో తహసీల్దార్ సాదియా సుల్తానా కు సమస్యలతో కూడిన వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహకులు మాట్లాడుతూ.. ఏండ్లుగా మీ-సేవ కేంద్రాలను నడుపూ, ప్రజలకు, అధికారులకు సంధాన కర్తలుగా ఉంటున్నామని, మా సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. మీసేవా కేంద్రాల నిర్వహణ రోజురోజుకి భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ హమి ఇచ్చారు. కార్యక్రమంలో నిర్వహకులు కుక్కడపు నరేష్, వెంకటేశ్వర్లు,సుధాకర్ రెడ్డి, భద్రం, పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !