మన్యం న్యూస్ ,కరకగూడెం: మండలంలోని చొప్పాల గ్రామానికి చెందిన తోలెం మల్లమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు.పేదరికంతో ఇబ్బందులు పడుతున్న మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి,దిశదినకర్మలకు నిరుపేద మృతురాలి కుటుంబానికి గ్రామస్తులు రూ.10వేలు, స్థానిక ఉద్యోగస్తులు రూ.10వేలు మొత్తంరూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు.భవిష్యత్తులోనూ గ్రామాల్లో తన వంతు సహాయ,సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తోలెం నర్సయ్య,జివ్వాజి సమ్మయ్య,ఎట్టి నర్సయ్య,తోలెం వీరస్వామి,సమ్మయ్య,ముత్తయ్య,నర్సయ్య,రాంబాబు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.